నల్లగొండ ప్రతినిధి, మే 19 (నమస్తే తెలంగాణ) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా విస్తృతంగా ప్రచారం ముమ్మరం చేసింది. ఆదివారం భువనగిరి, ఆలేరు నియోజకవర్గ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలకు తోడుగా మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ లీడర్లను ఇన్చార్జిలుగా నియమిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
దేవరకొండ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, కార్మిక విభాగం నేత రాంబాబు యాదవ్
మిర్యాలగూడ : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్సాగర్
మునుగోడు : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీహెచ్ రాకేశ్కుమార్
నాగార్జున సాగర్ : మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, విజయుడు
నకిరేకల్ : మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గువ్వల బాలరాజు
నల్లగొండ : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
హుజూర్నగర్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్
కోదాడ : మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, అంజయ్య యాదవ్
సూర్యాపేట : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్
తుంగతుర్తి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, గోలి శ్రీనివాస్రెడ్డి
ఆలేరు : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్
భువనగిరి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎండీ ఇబ్రహీం.