దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచారు. 2022 జనవరి10 తేదీ వరకు గడువు ఉందని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునీల ఓ ప్రకటనలో తెలిపారు. గత మార్చి 2021 విద్యాసంవత్సరం పాసై, మే 2022 ఇండర్మీడియట్ చదవాలనుకునే విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు.
తల్లిదండ్రుల పట్టణం ప్రాంత వార్షిక ఆదాయం 1.50లక్షల లోపు వుండాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు రూ.2లక్షల వరకు ఆదాయం వున్న వారు అర్హులని ఆమె చెప్పారు. ఎంట్రన్స్ జనవరి 23న జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కళాశాలలో బిఎ(హెచ్ఇపి), బి.కాం, కంపూటర్ అప్లికేషన్, ఎంపీసీఎస్, ఎంజెడ్సీ, బిజడ్సీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.