కోదాడ, మే 04 : అంగన్వాడీ కేంద్రాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3 అంగన్శాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పౌష్టికారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వేసవి సెలవులను పురస్కరించుకుని బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్రమ్మ, సూపర్వైజర్ పూజ పాల్గొన్నారు.