– కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, జూన్ 15 : చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆటపాటలతో చిన్నారులకు అక్షరాలను నేర్పిస్తున్నందున తమ పిల్లలను కేంద్రానికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సత్యనారాయణ, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటరమణ, పి.అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.