మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కరెంటు సరఫరా కోసం ఇచ్చిన విద్యుత్ మీటర్లను అందజేసినందుకు కృతజ్ఞతగా మిర్యాలగూడ రజక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
పట్టణంలో సుమారు 200 మంది అర్హులైన రజకులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ మీటర్లు అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ స్రవంతి, రజక సంఘం నాయకులు నల్లగంతుల నాగబూషణం, నాగరాజు, భిక్షం, పిచ్చయ్య, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.