నల్లగొండ : తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్లు బలోపేతం అయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumarthy Lingaiah) అన్నారు .సోమవారం నకిరేకల్ పట్టణంలోని నిమ్మ మార్కెట్ లో రూ.3 కోట్లతో సీసీ రోడ్డు, కాంప్లెక్స్, పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాన చేశారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులకు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తుందని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పేదలకు కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, విద్య, వైద్యం, రూ. 3 లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.