మద్దిరాల, మే 11 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు తిరుమలగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పును గ్రహించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పటిష్టతకు పాటుపడే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, జడ్పీటీసీ కన్న సురాంబ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు గంగవెల్లి వెంకటనర్సింహారావు, కన్న వీరన్న, జిలకర చంద్రమౌళి, మల్లు కలింగారెడ్డి, బొబ్బిలి ఉప్పలయ్య, కన్న విజయ్ పాల్గొన్నారు.