నీలగిరి,మార్చి 5 :2023-24 యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కార్యాచరణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో అధిక ధాన్యం దిగుమతి అయ్యేందుకు అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పీఏసీఎస్, ఐకేపీ అధికారులను ఆదేశించారు.
ముఖ్యం గా అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రేడ్-ఏ ధాన్యం రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా మారెటింగ్ అధికారి శ్రీకాంత్, లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ, మిల్లర్లు నారాయణ, శ్రీనివాస్, పెద్దయ్య పాల్గొన్నారు.