పెద్దఅడిశర్లపల్లి: ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలు స్తున్న టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమం కోసం పరితపిస్తున్న కేసీఆర్కు కార్యకర్తలు అండగా నిలిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల దృష్టికి తీసుకవెళ్లాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సారథి కేసీఆర్ జిల్లా తెలంగాణ జలసాధన ఉద్యమ ఫలితమే నేడు ఎస్ఎల్బీసీ పూర్తై నల్లగొండ జిల్లాకు సాగునీరు, జంట నగరాలకు తాగునీరు అందిందన్నారు.
రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, మాజీ జడ్పీటీసీ తేరా స్పందనారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్వపల్లి సరిత టీఆర్ఎస్ నాయకులు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, అంజిరెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడపగడపకు సంక్షేమ ఫలాలు
కొండమల్లేపల్లి/దేవరకొండ: ప్రభుత్వం చేపట్టే సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం కొండమల్లేపల్లిలోని సాయికృపా పంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల పార్టీ మండల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శమని క్షేత్ర స్థాయిలో పార్టీని బలో పేతం చేసేందుకు గ్రామ, పట్టణ, మండల కమిటీలు కీలకమని అన్నారు. తెలంగాణ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలను కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ కుంబం శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుంగేధర్రెడ్డి, దేవరకొండ మండల రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, నేనావత్ రాంబాబునాయక్, రమావత్ దశ్రునాయక్, పట్టణ అధ్యక్షుడు ఎలిమేనేటి సాయి, బోడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా రమావత్ దశ్రునాయక్, ప్రధాన కార్యదర్శిగా పసునూరి యుగేంధర్రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.