నకిరేకల్, అక్టోబర్ 23 : రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని వివిధ గురుకుల సొసైటీలో టీఎస్ యూటీఎఫ్ నకిరేకల్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి మైనార్టీ గురుకులాల్లో అమలు చేస్తున్న టైం టేబుల్స్ ను మిగతా గురుకుల సొసైటీలైన బీసీ, ఎస్సీ గురుకుల సొసైటీలలో కూడా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నర్సింహమూర్తి, కుర్మెళ్ల శ్రీనివాస్, నాయకులు జి.శ్రీలత, పి.జ్యోతి, ఈ.హరికృష్ణ, పి.జయసాగర్ పాల్గొన్నారు.