నల్లగొండ : నల్లగొండ గవర్నమెంట్ జనరల్ దవాఖానలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతులపై, డాక్టర్లు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. పేషెంట్లను దవాఖానలో సౌకర్యాలు, వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్లు సకాలంలో వైద్యులకు అందుబాటులో ఉండాలని, పేషెంట్లకు అన్ని విధాల నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని వైద్యులకు సూచించారు. హాస్పిటల్ కి వచ్చే నిరుపేదలకు అన్ని సౌకర్యాలు అందించే నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
ప్రభుత్వం ఇస్తున్న ప్రధాన్యతకు అనుగుణంగానే రోగులకు సేవలు అందించాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అందిస్తున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకోవాలి అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మరో గంటలో పెండ్లి..నగదు, బంగారంతో వరుడు పరారీ
488 మంది జర్నలిస్టులు అరెస్టు.. 46 మంది హత్య
వరంగల్లో జెన్ప్యాక్ట్ టెక్ సెంటర్.. మంత్రి కేటీఆర్ హర్షం