సంగారెడ్డి : మరి కొద్దిసేట్లో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన జంట.. వరుడు నగదు, బంగారంతో సహా పారిపోవడంతో పెండ్లి ఆగిపోయింది. కోటి ఆశలతో పెండ్లి కోసం ఎదురు చూసిన యువతి ఆశలు అడియాసలయ్యాయి. బంధువులు, బాజభజంత్రీలతో సందడిగా ఉండాల్సిన పెండ్లి మంటపం ఒక్కసారిగా మూగబోయింది.
వివరాల్లోకి వెళ్తే..వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు.
మరికాసేపట్లో పెండ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో పిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
488 మంది జర్నలిస్టులు అరెస్టు.. 46 మంది హత్య
వరంగల్లో జెన్ప్యాక్ట్ టెక్ సెంటర్.. మంత్రి కేటీఆర్ హర్షం
ఈసీఐఎల్లో 300 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు