రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, నేడు సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం నల్లగొండలో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకు పోతున్నదన్నారు. ఉమ్మడి నల్లగొండలో రెండు మెడికల్ కాలేజీలు వచ్చాయని, సర్కారు దవాఖానలను పూర్థిస్థాయిలో బలోపేతం చేయడంతో ప్రజలు వైద్య ఖర్చులు తప్పాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ ఏరియా ఆస్పత్రికి 5 నుంచి 10 ఓపీలు వచ్చేవని, నేడు 200లకు పైగా పెరిగాయని వివరించారు. జిల్లా కేంద్ర అసుపత్రితోపాటు ఏరియా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. సర్కారు ఆస్పత్రులో ప్రజలకు పెరిగిన విశ్వసనీయతకు ఇది అద్దం పడుతుందని చెప్పారు. దేశంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు.
నీలగిరి, జూన్ 14 : వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అద్భుతమైన ప్రగతి సాధించామని, దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా 30 నుంచి 40 శాతం తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డితో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదన్నారు. 20, 30 ఏండ్లు పాలించిన మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి లేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు 2014కు ముందు, ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని గమనించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య రంగంలో గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. రెండు మెడికల్ కాలేజీలు రాగా.. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 36 మంది డాక్టర్లు ఉంటే.. నేడు ఒక్క నల్లగొండ మెడికల్ కాలేజీలోనే 239 మంది ఉన్నారని తెలిపారు.
2014 కంటే ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలల్లో 1500 సీట్లు ఉంటే.. నేడు 26 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి 9,500 సీట్లకు పెంచారని గుర్తు చేశారు. సమైక్య పాలనలో జిల్లా ఆస్పత్రి పకన ఉన్న వారు సైతం అనారోగ్యం వస్తే ప్రైవేట్ హాస్పిటల్కు పోయారని, నాడు పీహెచ్సీలలో వైద్యం దికులేదని, నేడు పీహెచ్సీలలో ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏరియా ఆస్పత్రిలో 5 నుంచి 10 ఓపీలు వచ్చేవని, నేడు 200కు పైగా ఓపీలు పెరిగాయని వివరించారు. జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఏరియా ఆస్పత్రుల్లో కూడా డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. సమైక్య పాలనలో సర్కారు దవాఖానకు పోతే పట్టించుకునే నాథుడే లేకపోయేదని, ఇక పరీక్షల మాట దేవుడికే ఎరుకని అన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో టీ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి 60కి పైగా ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు క్యాన్సర్ స్రీనింగ్ చేస్తున్నారని తెలిపారు. మాతృ మరణాల సంఖ్య తెలంగాణలో గణనీయంగా తగ్గిందని, దేశంలో లక్ష మందిలో 97 మాతృ మరణాలు ఉంటే రాష్ట్రంలో ఆ సంఖ్య 39కి తగ్గిందని చెప్పారు. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 39 మంది మరణిస్తే, నేడు ఆ సంఖ్య 27కు తగ్గిందన్నారు. పుట్టే బిడ్డ పోషకాహార లోపంతో ఉండొద్దనే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారని తెలిపారు.
ఆశ వరర్లకు గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో రూ.4వేల నుంచి రూ.6వేల వరకు జీతం ఉంటే.. తెలంగాణలో రూ.9500 ఉన్నదని చెప్పారు. 2014లో ప్రభుత్వాస్పత్రుల్లో 31శాతం, ప్రైవేట్లో 69శాతం నార్మల్ డెలివరీలు ఉంటే, నేడు ప్రభుత్వాస్పత్రుల్లో 58 శాతానికి పైగా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పునరుద్ధరణతో ఏటా రూ.10వేల కోట్ల ప్రజాధనం మిగులుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే.. ప్రతిపక్షాల కండ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గుజరాత్లో సామాన్య వ్యక్తిగా ఆవు కొనుగోలు కోసం వెళ్లిన తాను ఆ రాష్ట్రంలో వైద్య పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుసుకున్నానన్నారు. అకడి ప్రజలకు కిడ్నీ జబ్బు వస్త్తే ప్రభుత్వం పట్టించుకునే దికు లేదని చెప్పారు. గుజరాత్ ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని, పారిశుధ్యం అధ్వానంగా ఉన్నదని వివరించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చి వేసిందన్నారు.
సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని గ్రామ స్థాయి నుంచి పునరుద్ధరించి ప్రజలకు మరింత చేరువ చేశారని తెలిపారు. బస్తీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు మంత్రి జగదీశ్రెడ్డి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. కేసీఆర్ కిట్, కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బహుమతుల ప్రదానం, సన్మానాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్ఓ అన్నీమళ్ల కొండల్రావు, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లచ్చునాయక్, ప్రిన్సిపాల్ రాజకుమారి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఎంపీపీలు, కౌన్సిలర్లు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.