తుంగతుర్తి, మార్చి 28 : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు. వీరి వివాహం 2012లో జరుగగా గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. భార్యాభర్తలు తిరిగి కలిసి పోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. కేసులు వద్దు సామరస్య పరిష్కారమే ముద్దు అన్నారు, అది లోక్ అదాలత్ లో సాధ్యపడుతుందని తెలిపారు. కక్షిదారులు క్షనికావేశాన్ని మరిచి ప్రతి ఒక్కరు ప్రేమాభిమానంతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరసింహారావు, ఎస్ఐలు క్రాంతి కుమార్, చిరంజీవి, సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనపర్తి జ్ఞాన సుందర్, కారంగుల వెంకటేశ్వర్లు, పర్వీన్ బేగం, రాజు, వేణు యాదవ్, సతీశ్ పాల్గొన్నారు.