75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. కలెక్టరేట్లో, పోలీస్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ దాసరి హరిచందన ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చందనా దీప్తి, డీఏఓ కార్యాలయంలో డీఈఓ సుచరిత, డీఈఓ కార్యాలయంలో డీఈఓ భిక్షపతి, ఎంజీయూలో వీసీ గోపాల్రెడ్డి, జడ్పీలో సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, మున్సిపాలిటీలో కమిషనర్ రవి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పార్టీ కార్యాలయాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల్లో మువ్వన్నెల జెండాలను ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.