నీలగిరి/నల్లగొండ రూరల్/తిప్పర్తి/గుర్రంపోడ్, మార్చి 8 : నల్లగొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 700 కోట్లతో నల్లగొండకు బైపాస్ రోడ్డు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డు చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో శుక్రవారం రూ.216 కోట్లతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.56 కోట్ల మంచినీటి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
డీవీకే రోడ్డులో అన్నపూర్ణ క్యాంటీన్ ప్రాంరభించారు. అనంతరం నల్లగొండ నుంచి నర్సింగ్భట్ల మీదుగా కురంపల్లి వరకు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు గుండ్లపల్లిలో శంకుస్థాపన చేశారు. తిప్పర్తి మండలంలోని మామిడాల పీడబ్ల్యూ రోడ్డు నుంచి వయా చిరుమర్తి-మాడ్గులపల్లి వరకు రూ.రూ 44.76 కోట్లతో నిర్మించనున్న బీటీ డబుల్ రోడ్డు.. ఇండ్లూరు నుంచి చందనపల్లి వరకు రూ 26.5 కోట్లతో నిర్మించనున్న బీటీ డబుల్ రోడ్డు పనులకు.. గుర్రంపోడు మండలం లచ్చుగూడెం స్టేజీ నుంచి పాల్వాయి వరకు రూ.10 కోట్లతో చేపట్టనున్న 26 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామన్నారు.
ముషంపల్లి డబుల్ రోడ్డుకు రూ.100 కోట్లు ఇప్పటికే కేటాయించామని తెలిపారు. నల్లగొండ- దేవరకొండ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు తాను కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చానని చెప్పారు. ఎస్ఎల్బీసీ కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాని నిధులను మంజూరు చేయించామని చెప్పారు. పట్టణంలోని నిరుపేదలకు దేవరకొండ రోడ్ హౌసింగ్ బోర్డు వెనుక ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేసిందని, మిగిలిన ఒక గ్యారెంటీ కూడా ఈ నెల 11న అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీలు పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీలు సుమన్, విజయలక్ష్మీలింగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్లు ఖయ్యూంబేగ్, అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, పర్హత్ ఫర్జానా ఇబ్రహీం, జెర్రిపోతుల అశ్వినీభాస్కర్గౌడ్, ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, కత్తుల శంకర్, ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, ఈఈ ఖాజన్ గౌడ్, డీఈ గణేశ్ కుమార్, ఏఈ పి.అనిత, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, నాయకులు గుమ్ముల మోహన్రెడ్డి, పాధూరి శ్రీనివాస్, రెడ్డి, జూకూరి రమేశ్, బద్దం సుధీర్, వెంకట్రాంరెడ్డి, సందీప్రెడ్డి, జేకే రాజు, సహదేవ్, జాకీర తాజ్, పనస శంకర్ గౌడ్, సుంకు ధనలక్ష్మి పాల్గొన్నారు.