కట్టంగూర్, అక్టోబర్ 24 : ప్రజల చేతిలో కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం తప్పదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్కు చెందిన 50మంది యువకులు మంగళవారం కట్టంగూర్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటితో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ను ఆదరించి కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, నాయకులు బాలనర్సయ్య, గణేశ్, సైదిరెడ్డి పాల్గొన్నారు.
నార్కట్పల్లి : పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వంగాల శంకర్గౌడ్, ఉగ్గెపల్లి శ్రీను, లోకేశ్ ఉన్నారు.
చిట్యాల : మండలంలోని వేంబావి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పంగరెక్క జగదీశ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో జగదీశ్తోపాటు కాంగ్రెస్ నాయకుడు ఉయ్యాల సత్తయ్య బీఆర్ఎస్లో చేరగా వారిని ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నక్క జానయ్య, పంగరెక్క ప్రసాద్, ఆదె నర్సింహ, గుండు వెంకన్న పాల్గొన్నారు. అలాగే వెల్మినేడులో వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో టేకుల మల్లారెడ్డి, టేకుల రాజిరెడ్డి, ఏనుగుల అనిల్రెడ్డి, పైళ్ల రఘువీరారెడ్డి, సామకూరి శంకరయ్య, గోలి యాదయ్య, ఏనుగు తేజవర్ధన్రెడ్డి ఉన్నారు. శ్రీశైలం, మశ్చేందర్, సుధాకర్రెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని పల్లివాడకు చెందిన 50 మంది యువకులు నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఎబీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో జనపాల ఉపేందర్, దండిగ మహేశ్, ఇప్పలపల్లి నవీన్, దండిగ రాజు, కల్యాణ్, పవన్, జిట్టంగి వేణు, కళ్లెం నవీన్, దండిగ ఉపేందర్, కళ్లెం జై ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆవనగంటి నర్సింహ, గడ్డం యాదగిరి, కర్రె శ్రీనివాస్, ఉపేందర్, దండిగ నాగరాజు, మారయ్య పాల్గొన్నారు.