ఆలేరు నియోజకవర్గాన్ని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, మరింత ప్రగతికి మరో అవకాశం ఇవ్వండని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. రాజాపేట
మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ గ్యారంటీలేని కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ పథకాలు అందిస్తామన్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.
రాజాపేట, నవంబర్ 8 : ఆలేరు నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. మరో చాన్స్ ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రఘునాథపురం, చల్లూరు, బేగంపేట, రేణికుంట, నర్సాపురం, రాజాపేట, కొండారెడ్డిచెర్వు, పుట్టేగూడెం, మల్లేగూడెం, కాశేగూడెం, కొత్తజాల, జాల, పాముకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కళకారుల ఆటపాటల మధ్య ర్యాలీ కొనసాగింది. ప్రజలు అడుగడుగున బ్రహ్మారథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు ప్రజలకు శ్రీరాముడు రక్షణ కల్పిస్తే నేడు సీఎం కేసీఆర్ శ్రీరామరక్షగా నిలుస్తున్నారన్నారు.
రాష్ట్ర సాధన కోసం ఆహర్నిషలు కష్టపడిన ఉద్యమబిడ్డనని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అవినీతికి తావులేకుండా సేవ చేశానని చెప్పారు. తరతరాలుగా చెప్పుకునేలా ఆలేరు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిని చేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆరు కాదు 60 గ్యారంటీలు అందిస్తామన్న ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా చీకటిమయై ప్రజలు గోసపడుతారని వివరించారు. రైతుల భూములను అక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించదిలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో సీఎం కేసీఆర్ ప్రజల్లో మరింత భరోసా నింపారన్నారు.
ఆసరా, దివ్వాంగుల పింఛన్, రైతు బంధు సాయం పెంపుతో పాటు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం, రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమాలాంటి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు రూ. 3వేల జీవన భృతి అందిస్తారని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్య హక్కు కల్పించడంతో పాటు అగ్రవర్ణ పేదల బిడ్డలకు రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మోత్కుపల్లి జ్యోతీప్రవీణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, చింతలపూరి వెంకట్రాంరెడ్డి, మండల సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్రెడ్డి, వైస్ చైర్మన్ కాకల్ల ఉపేందర్, సర్పంచులు గుంటి మధుసూదన్రెడ్డి, ఠాకూర్ ధర్మేందర్సింగ్, దేవిరాములునాయక్, బూర్గు భాగ్యమ్మానర్సిరెడ్డి, బెజుగం రాజేశ్వర్గుప్తా, చెరుకు కనకయ్య, గోపిరెడ్డి, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, నాయకులు బెడిదె వీరేశం, కొరుకొప్పుల వెంకటేశ్గౌడ్, సట్టు తిరుమలేశ్, రేగు సిద్ధులు, గుర్రం నర్సింహులు, ఎర్రగోకుల జశ్వంత్, బిల్లకుదురు రాజు, బోగ హరినాథ్, ఎర్రగోకుల జశ్వత్, మన్నె ప్రభాకర్, సురేశ్, బాలకృష్ణ పాల్గొన్నారు.