అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బోర్డుపై చెప్పే పాఠాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించేందుకు విద్యాసంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తమ పాఠాలతో ఎంతో మంది విద్యార్థులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీర్చిదిద్దుతున్నారు. వారికి గుర్తింపుగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది రాష్ట్రస్థాయికి 9 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు అధ్యాపకులను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా స్థాయికి 35 మంది ఎంపిక కాగా సోమవారం భువనగిరిలో సన్మానించనున్నారు.
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 4: యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు డీఈఓ కే. నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉత్తమ గురువులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో ఆలేరు మండలం కొల్లూరు జడ్పీహెచ్ ఉపాధ్యాయులు కె.రవీందర్, కె.సత్యనారాయణ, పటేల్గూడెం ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు ఏ.జ్యోతిర్యయి, తుర్కపల్లి మండలంలో తుర్కపల్లి (ఎం) జడ్పీహెచ్ ఎస్ ఉపాధ్యాయుడు శేషగిరిరావు, ముల్కపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు పి.కల్యాణి, సంస్థాన్నారాయణపురం మండలం గుజ్జ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ఎస్.హనుమంతు, ఎంపీపీఎస్ నుంచి పి.దేవేందర్, సంస్థాన్నారాయణపురం జడ్పీహెచ్ఎస్లో పి. శ్రీనివాసులు, బీబీనగర్ జడ్పీహెచ్ పాఠశాల – వి.శ్రీనివాసులు, మక్తఅనంతారం ఎంపీపీఎస్ పాఠశాల- బి.విజయభాస్కర్రెడ్డి, మోటకొండూర్ మండలం ఇక్కుర్తి జడ్పీహెచ్ పాఠశాల-టి.రంగనాయక్రాజు,భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెం పాఠశాల – మహిపాల్రెడ్డి, ముక్తాపూర్ ఎంపీయూపీఎస్ నుంచి కె.సంధ్య, రాజపేట మండలంలోని దూదివెంకటాపూరం జడ్పీహెచ్ పాఠశాల – ఎన్. నర్సింహాచారి, భువనగిరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్.విజయలక్ష్మి, రామన్నపేట మండలం నిర్నేముల ఎంపీయూపీఎస్ నుంచి ఆర్. స్వరూపారాణి, ఇక్కుర్తి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు పి.గోపాల్రెడ్డి, వలిగొండ జడ్పీహెచ్ఎస్ – కే.లీలావతి, గుండాల జడ్పీహెచ్ నుంచి ఎం.మెరీగ్రేస్, మోత్కూర్ ఎంపీపీఎస్ పాఠశాల – ఆర్.రవీందర్రెడ్డి, పాటిమట్ల ఎంపీపీఎస్ పాఠశాల – వీ ప్రవీణ్కుమార్, ఆత్మకూర్(ఎం) ఎంపీపీఎస్ మెరిపిరాల పాఠశాల- ఏ.అశోక్, ఆలేరు ఎంపీపీఎస్ పాఠశాల నుంచి జే.శోభ, అడ్డగూడూరు మండలం జానకీపురం పాఠశాల – సీహెచ్ సోమేశ్వర్, చౌళ్లరామారం ఎంపీపీఎస్ పాఠశాల-ఎస్.యాదగిరి, వలిగొండ మండలం తుర్కపల్లి(ఎం) ఎంపీపీఎస్ పాఠశాల – ఆర్. ప్రవీణ్కుమార్, భువనగిరి మండలం వడపర్తి ఎంపీపీఎస్ పాఠశాల- బి.శైలజ, ఆలేరు మండలం పటేల్గూడెం పాఠశాల – జె.సతీశ్కుమార్, బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి జడ్పీహెచ్ఎస్- ఎం.స్వామి, వలిగొండ మండలం ప్రొద్దుటూరు ఎంపీపీఎస్ పాఠశాల నుంచి జి. సంహిత, ఇక్కుర్తి జడ్పీహెచ్ పాఠశాల -శ్రీనివాసచారి, మోటకొండూర్ జడ్పీహెచ్ పాఠశాల – కే.వినోద్కుమార్, బొమ్మలరామారం మండలం జలాల్పూర్ జడ్పీహెచ్ పాఠశాల – బి.నర్సింహ, అడ్డగూడూరు మండలం కేజీబీవీ పాఠశాల నుంచి జె.సరిత, భువనగిరి ఐఈఆర్సీ ఉపాధ్యాయురాలు రాణి ఉన్నారు.
అవార్డుల ప్రదానం
ఉత్తమ ఉపాధ్యాయులను భువనగిరి పట్టణ పరిధిలోని రాధాకృష్ణ ఫంక్షన్హల్లో సోమవారం మధ్యాహ్నం అవార్డు ప్రదానంతో పాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని డీఈఓ తెలిపారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, రాజసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య హాజరవుతారని చెప్పారు.