నీలగిరి, జూన్ 12 ;రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ్యారు. నల్లగొండలో జరిగిన కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరయ్యారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు రన్లో పాల్గొని ముందుండి
నడిచారు.
స్వరాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించేందుకు నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పండుగలా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పోలీస్, యువజన శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 2కే రన్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో అధికారులు, పోలీస్ సిబ్బంది, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో ఉత్సాహంగా పరుగులు తీశారు. నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి జెండా ఊపి బెలూన్లు వదిలి ర్యాలీని ప్రారంభించారు. సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు 2కే రన్ను ప్రారంభించి యువతతో కలిసి పరుగు తీశారు.