పెద్దపల్లి : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని రామగిరి మండలం లడ్ని పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పులి రాజలింగం గౌడ్ (45) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున తన ఇంటి ముందు రేకుల షెడ్ లో తాడుతో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య కనక లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్