Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్ఫోన్, రెండు బీర్ బాటిళ్లు ఎత్తుకెళ్లారు.
ఉదయం వైన్స్కు వచ్చిన తర్వాత షాపు తాళం పగులకొట్టి ఉండటంతో షాప్ నిర్వాహకులకు విషయం తెలిసింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైన్ షాపులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.