హాలియా, డిసెంబర్ 1: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2, 33, 412 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ 234 ప్రాంతాల్లో 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 2, 00, 235 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018 శాసన సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో స్వల్పంగా 0.86 శాతం ఓటింగ్ తగ్గింది.
నిడమనూరు మండలం బంటువారిగూడెంలో 197 బూత్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఈ బూత్లో 516మంది ఓటర్లు ఉన్నారు. అందులో 256 మంది పురుషులు, 260 మంది మహిళలున్నారు. మొత్తం 501మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంటువారిగూడెంలో అత్యధికంగా 97.09శాతం పోలింగ్ నమోదైంది.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో 107వ బూత్లో అత్యల్పంగా 42.47 శా తం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 897 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 293 మంది మహిళలు కాగా, 604 మంది పురుషులు. మొత్తం 381 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.