నల్లగొండ, ఫిబ్రవరి 20: ‘ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ్యవసాయం పండుగలా మారింది.. సాగునీటితోపాటు నిరంతర ఉచిత విద్యుత్, ఎరువులు అందిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కరెంట్ సరఫరాపై
అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని, రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది తెలంగాణ రాష్ట్రమేనని, చిన్న రాష్ట్రమైనా ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నదని అన్నారు.
ఆంధ్ర పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణ ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ మార్క్తో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత కార్యాలయంలో శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తి కాగా ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త అధ్యక్షుడిని సన్మానించి మాట్లాడారు. 2014కు ముందు తెలంగాణలో వ్యవసాయం ఆగమ్యగోచరంగా ఉంటే ఆ తర్వాత 6 నెలల్లో గృహాలు, మూడేండ్లలో వ్యవసాయానికి 24 గంటల కరంట్ ఇచ్చి దేశంలోనే రికార్డు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ముందున్నదన్నారు. అప్పుడు కరంటు, ఎరువులు, నీళ్లు ఏదో ఒక సమస్యతో ప్రజలు పోరాటాలు చేస్తే నేడు అలాంటి పోరాటాలే కనిపించడం లేక పోవడానికి సీఎం కేసీఆర్ దార్శనికత కారణమని పేర్కొన్నారు. 24 గంటల కరంటు ఇస్తుంటే ఇది ఎలా సాధ్యం అవుతుందని ఆంధ్రా మంత్రులు తనను అడిగారన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అంటున్న నాయకులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఏడు గంటలకు మించిన కరంట్ ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు ఏ ఒక్క ఏడాది కూడా రెండు పంటలకు సాగు నీరు ఇవ్వలేదని ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ రెండు పంటలకు నీరు ఇస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేడు 24 గంటల విద్యుత్, సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా అమలు జరుగుతున్నందున రైతులు ఎంతో సంతోషంగా ఇష్టంగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం 24 గంటల కరంటు ఇస్తుంటే ఈ జిల్లాకు చెందిన ప్రబుద్ధులే 24 గంటల కరంటు వద్దు అని స్టేట్మెంట్లు ఇచ్చి నిన్న రెండ్రోజులు పాటు విద్యుత్కు అంతరాయం కలిగితే మళ్లీ బదనాం చేసే కుట్ర చేసినట్లు తెలిపారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మకుండా మీ ఊర్లోకి వచ్చిన వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ సింహా రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, డీఏఓ సుచరిత, ఏడీఏ హుస్సేన్ బాబు పాల్గొన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చింది తెలంగాణే
దేశంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది తెలంగాణ రాష్ట్రమే. దేశంలో అత్యధికంగా వరి పండించే పంజాబ్ రాష్ట్రం కంటే అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ అంతకు మించిన ధాన్యం ఉత్పత్తి చేసింది 24 గంటల కరంట్, 46వేల చెరువుల పూడిక తీత, 19 లక్షల పంపు సెట్లకు 24 గంటల కరంట్, రైతులకు పెట్టుబడి, రైతు బీమా, పంటల కొనుగోళ్ల్లు చేపట్టే విధానం చూసి స్వయంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎంతో ప్రశంసించారు. ఇటీవల రాష్ర్టానికి వచ్చిన ఛత్తీస్ గఢ్ వ్యవసాయ మంత్రి సైతం ఇలాంటి అభివృద్ధి ఎక్కడా చూడలేదన్నారు.
కేంద్రం చేతులెత్తేసినా రాష్ట్రం ఆదుకుంది
రాష్ట్రంలో ధాన్యం కొనలేమని కేంద్రంలో చేతులెత్తేస్తే సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయకుండా రైతులను నష్టపరచ వద్దనే ఆలోచనతో ప్రతి గింజా కొనుగోలు చేశారు. అందుకే ఈ రోజు ప్రతి రైతు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించుకునేందుకు, అధికారులను రైతులకు దగ్గర చేసేందుకు రైతు వేదికలు నిర్మించారు. అలాగే రైతుల వ్యవసాయం గురించి తెలిసిన వాళ్లకే నేడు రైతు బంధు అధ్యక్ష పదవులు ఇచ్చి రైతును పాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత సీఎందే .
రైతును కాబట్టే నాకీ గుర్తింపు: చింతరెడ్డి
చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాడిని, రైతుల కష్టాల గురించి తెలిసిన వాడిని కాబట్టే సీఎం కేసీఆర్ తనను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా నియమించారు. కేసీఆర్ సీఎం కావడం వల్ల నేడు ప్రతి రైతు ఎంతో ఆనందంగా ఉన్నాడు. నేను రైతును కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలుసునని సీఎం ప్రతి రైతును కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. గతంలో ఎరువులు, కరెంట్, నీళ్ల కోసం నేను రైతు సంఘం నేతగా ఎన్నో పోరాటాలు చేశాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ రైతుకు అక్కరలేకుండా పోయింది.