సూర్యాపేట, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్లోని ఓ కార్యకర్త కాలి గోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు… రెం డేళ్లుగా రేవంత్ వ్యాఖ్యలతో ఆయన నోరు కన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నారు…అలాంటి వ్యక్తి నోట కేసీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన సర్పంచ్ల అత్మీయ సమ్మేళనంలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు విని పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లే సిగ్గుపడుతున్నారన్నారు. గంటపాటు కేసీఆర్ నీళ్లపై జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే సమాధానం చెప్పలేక విషం కక్కుతుండని ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రేవంత్కు, కాంగ్రెస్కు రాళ్లుకట్టి మూసీలో పడేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అడ్డిమారి గుడ్డి సూటిన ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డికి ఒక విధానం లేదు… దేనిపైనా అవగాహన లేదు. కేవలం పదవులు కొనుక్కునేందుకు నాడు రెడ్హ్యాండెడ్గా డబ్బుమూటలతో ఎలా దొరికా డో..అదే మాదిరి నేడు మూటల సీఎం అయ్యాడని విమర్శించారు. రేవం త్.. నీ వ్యాఖ్యలతో గల్లీ స్థాయి నాయకుడివని మళ్లీ రుజువు చేసుకున్నావు.. పదేండ్ల పాటు తెలంగాణ అంటే దేశంలో ఒక బ్రాండ్ ఉందని, అలాంటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన నీవు దయచేసి ఆ హోదాను మరింత దిగజార్చవద్దని హితవు పలికారు. రండలు మాట్లాడే భాషనే రేవంత్ మాట్లాడుతుండు తప్ప కేసీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పలేక విషం కక్కుతున్నడని ధ్వజమెత్తారు. నువ్వెంత దిగజారినా ఆ స్థాయికి మేము దిగజారబోమని, తమ పార్టీ కార్యకర్తలు కూడా నీలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయరని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్లలో ఒక్క సారైనా కేసీఆర్ నీ పేరు ఎత్తిండా..? అని ప్రశ్నించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ గంట పాటు మీడియాలో మాట్లాడి విమర్శిస్తే సమాధానం చెప్పాలే తప్ప..ఎదురు దాడికి దిగడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాస్ కేసీఆర్ ఏం మాట్లాడిండో.. కోట్లాది మంది జనం చూశారు.. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో అన్యాయం జరిగితే ప్రభు త్వం తోలు తీస్తా అన్నాడే తప్ప స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదన్నారు. నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదు, నదులపై హక్కులను కేంద్రం గుంజుకుంటోందంటే వినలేదు..నీటి విషయంలో చంద్రబాబు, మోదీ ద్రోహం చేస్తున్నారని చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్న రేవంత్.. ఆయన మంత్రి వర్గం బూతులతో బయటకు రావడాన్ని జనం అసహ్యించుకుంటున్నారన్నారు. మీ పదవుల కోసం మా గొంతులు ఎండబెడతామంటే ఊరుకుంటామా..తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మేము మౌనంగా కూర్చోలేమన్నారు.
ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసీఆర్పైన ఉందని తెలంగాణ తెచ్చిన వాళ్లంగా, ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అన్నారు. కేసీఆర్ సభలు పెడితే మీ దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నావని, తెలంగాణకు అ న్యాయం జరుగుతుందని చెప్పినా..మా పైనే ఎదురు దాడికి దిగుతుండ్రని ఇట్లనే ఉంటే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రజలకు తీవ్ర నీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇరిగేషన్ మంత్రి అవగాహన లేకుండానే 45 టీఎంసీలకు ఒప్పుకుంటున్నట్లు మీకు తెలియకుండానే కేంద్రానికి లేఖ రాశాడా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీయారే కా దు ప్రజలు కూడా ప్రభుత్వం తోలు వొలుస్తారు..ప్రభు త్వం కండ్లు తెరవకపోతే తామే ప్రజా ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించారు. మంచి పనులు చేసి మంచి మాటలతో ప్రజల హృదయాలు గెలవాలే తప్ప నీ వ్యాఖ్యలతో మీ సర్పంచులే సిగ్గుపడేలా చేశావన్నారు.