మిర్యాలగూడ రూరల్, జూలై19 : మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం అవసరమైన స్థలాన్ని సోమవారం ఎంపీడీఓ అజ్మీర దేవిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ శివారులో 5.5 ఎకరాల స్థలాన్ని పల్లెప్రకృతి వనం కోసం కేటాయించినట్లు తెలిపారు. పనులను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా హరితహారం కార్యక్రమంలో రెండు వేల మంది పాల్గొని మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీఓ వీరారెడ్డి, సర్పంచ్ అశోక్రెడ్డి, కార్యదర్శి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
పదెకరాల్లో ఏర్పాటు
చందంపేట : మండలంలోని కోరుట్ల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతివనం పనులను వేగవంతం చేసినట్లు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలో పల్లెప్రకృతి వనం కోసం కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థలాన్ని ఇప్పటికే చదును చేసి హద్దులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట సర్పంచులు అనంతగిరి, శంకర్ రావు, రామకృష్ణ ఉన్నారు.