తుంగతుర్తి, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అని, నియోజకవర్గ ప్రజలే నా బలగం మని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సమావేశంలో తుంగతుర్తి మార్కెట్ స్థలంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ, భగీరథ, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, హరితహారం, పల్లె ప్రకృతి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతులు పండించిన ప్రతి గింజాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గానికి సంబంధించి 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో సాగు,తాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడ్డారని నేడు ప్రతి గ్రామ ంలో చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నింపడంతో రైతులు రెండు పంటలు పండించుకొని ఆనందంగా ఉన్నారని అన్నారు.
తెలంగాణపై మోదీ ప్రభుత్వం వివక్ష
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని ఎద్దేవా చేశారు. మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నేడు గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసి దేశంలోనే 16కు పైగా అవార్డులు గెలుచుకున్న ఘనత తెలంగాణ గ్రామ పంచాయతీలదే అన్నారు. తెలంగాణలో బీసీ గణన జరుపాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ పార్లమెంట్కు పంపినట్లు గణన జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఎమ్మెల్యే కిశోర్కుమార్కు పోటీ లేదు
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు పోటీ లేదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తుంగతుర్తి అభివృద్ధ్దికి రూ.1,500ల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిన ఘనత కిశోర్కకుమార్కే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పలు దఫాలుగా చర్చించి 100 పడకల ఆసుపత్రిని రూ. 44కోట్ల నిధులతో మంజూరు చేయించిన ఘనత ఆయనదే అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ హ్యాట్రిక్ సాధనలో ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్యాదవ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లు రాంచంద్రారెడ్డి, ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.