హాలియా, ఏప్రిల్ 7 : ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని, నోముల భగత్తోనే సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. నోముల భగత్ను గెలిపించాలని కోరుతూ బుధవారం హాలియా మున్సిపాలిటీ 7వ, 8వ, 9వ వార్డుల్లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సతీమణి నోముల లక్ష్మితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండవర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న గులాబీ పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలని అన్నారు. కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ మలిగిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్ ప్రసాద్నాయక్, దుర్గారావు, శ్రీను, లింగయ్య, సతీశ్ పాల్గొన్నారు. అనంతరం కుట్టు మిషన్ మహిళ కార్మికులు, ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఈ సందర్భంగా నోముల లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, వెంకట్రెడ్డి, ముత్యాలు, వెంకటయ్య, ఆర్టీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కిలారి కృష్ణ
కాంగ్రెస్ పార్టీ హాలియా పట్టణ ఉపాధ్యక్షుడు కిలారి కృష్ణ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరో 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఇవీ కూడా చదవండీ…