పదర: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో పదర మండల పరిధి మద్దిమడుగు గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై అదివారం జరిగింది. బంధువులు, అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్ తండాకి చెందిన జటావత్ శ్రీను మరో 7మంది కుంటుంబ సభ్యులు తమ సొంత ఆటోలో శనివారం ఉదయం 11గంటలకు నల్లమలలో వెలసిన పబ్బతి ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వచ్చి సాయత్రం కుంటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకున్నారు.
అనంతరం ఆదివారం ఉదయం మద్దిమడుగు నుంచి తమ స్వగ్రామానికి బయలుదేరి వెళుతుండగా మార్గమధ్యలో మద్దిమడుగు గ్రామ సమీపంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటనలో మృతులంతా ఒకే కుంటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలోజటావత్ శ్రీను 33 అటోడ్రైవర్, కేతావత్ పోలీ 60, జటావత్ చందు నాయక్ 60 అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయా లవగా చికిత్స నిమిత్తం 108అంబులెన్స్ ద్వారా అచ్చంపేటకు తరలించారు. అనతరం మెరుగైన చికిత్స కోసం హైదరా బాద్కు తరలించారు. మృతదేహలను అమ్రాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.