నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ పనులను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి పరిశీలించారు. ట్యాంక్ బండ్పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాకింగ్ దారులు, మువ్వన్నెల జెండా స్తంభం, ప్లోరింగ్ పనులను పరిశీలించారు.
దసరా నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమీషనర్ గోనె అన్వేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, టీఆర్ఎస్ నాయకులు ఈశ్వర్రెడ్డి, భాస్కర్గౌడ్, సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.