నాగర్కర్నూల్: సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో చట్టపరమైన లోపాలు లేకుండా చూడాలని రాష్ట్ర నీటి పారుదల ఓఎస్డీ మనోహర్ సూచించారు. మంగళవారం రాత్రి నాగర్కర్నూల్ కలెక్టరేట్లో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పాలమూరు-రంగారెడ్డి, మహాత్మాగాంధి కల్వకుర్తి, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథ కాలకు సేకరించే పూర్తిస్థాయి భూసేకరణ జరిగే వరకు అధికారులు చేపట్టాల్సిన చట్టపరమైన అంశాలపై కలెక్టర్, అధికా రులతో చర్చించారు.
ఏవిధంగా రైతుల భూమిని అవార్డు నిర్వహించాలి, వినతులను ఎలా పరిష్కరించాలనే అంశంపై అవగాహన కల్పించేందు కు రెండు జిల్లాకు చెందిన రెవెన్యూ, నీటి పారుదల అధికారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్ఆర్ డైరెక్టర్ రూపాస్ దత్తుతో కలిసి వర్క్షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 4 ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను ఎలాంటి చట్ట పరమైన భూసేకరణను ఎలాంటి చట్టపరమైన లోపాలు లేకుండా భూసేకరణ చట్టానికి లోబడి భూసేకరణ రగాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ చేసేటప్పుడు ఏవిధంగా పరిష్కరించాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించారు.
భూసేకరణ సందర్భంలో భూమి యజమానుల వినతులను, కోర్టు కేసులు ఎలా పరిష్కరించాఆలి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని, ప్యాకేజీల వారీగా భూసేకరణ, పరిహారానికి సంబంధించిన నిధులు, ఇతర సమస్యలను పేలుళ్లు చేపట్టాల్సిన పనులు వేగవంతం చేపట్టాలని చెప్పారు. రెండు జిల్లాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో 4 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు చేపట్టే భూసేకరణతో యజమానుల నుండి భూసేకరణ చేసేందుకు చట్టపరమైన అంశాలకు లోబడి వంద శాతం భూసేకరణను చేపట్టి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని వెంటనే అందజేస్తామని సూచించారు. సమావేశంలో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల ఆర్డీవోలు, నీటి పారుదల శాఖ అధికారులు, తాసీల్దార్లు పాల్గొన్నారు.