నాగర్కర్నూల్ : నేడు జిల్లాలో (మంగళవారం) వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో దవాఖాన, జిల్లా కేంద్రంలో పాలియేటివ్ కేంద్రాలను మంత్రి ప్రారంభిస్తారు.
అలాగే సాయంత్రం 5 గంటలకు నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల అధికారులతో మంతటి గడ్డ దగ్గరలో ఉన్న తేజ కన్వెన్షన్లో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మంత్రి తిరిగి హైదరాబాద్కు వెళ్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.