భువనగిరి అర్బన్, జూలై 8: పల్లె ప్రగతి కార్యక్రమం గత 8 రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నది. గురువారం మన్నెవారిపంపు గ్రామంలో సర్పంచ్ బోయిని పాండు, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచనల మేరకు ఆయా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. సిరివేణికుంట గ్రామంలో రహదారి వెంట మొక్కలు నాటి ట్రీ గార్డులను సర్పంచ్ పడాల అనితావెంకటేశ్వర్లు ఏర్పాటు చేయించారు. అదే విధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ, వార్డుల్లో పారిశుధ్య పనులు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో సిరివేణికుంట ఉప సర్పంచ్ చెన్న అమృతాపద్మారెడ్డి, వార్డు సభ్యులు కిషన్, రావుల భరత్, బొర్ర మమత, నవీన్, నాగు, లక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
మహిళలకు ముగ్గుల పోటీలు
పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలవ్యాప్తంగా పలు చోట్ల మామిడి తోరణాలు కట్టి రంగురంగుల ముగ్గులు వేశారు. అంతేకాకుండా గ్రామపంచాయతీల ఎదుట మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలను డీఎల్పీవో సాధన, ఎంపీడీవో రాకేశ్రావు పర్యవేక్షించారు.
చెత్తాచెదారం తొలగింపు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ కార్యక్ర మం ద్వారా మండలంలోని మహదేవపురం గ్రామంలో ఇం డ్ల మధ్య పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు స్థానికులు.
పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని మండల ప్రత్యేకాధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నా రు. గురువారం మండల కేంద్రంతోపాటు సిరిపురం గ్రా మంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను వారు పరిశీలించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో చెత్త ను సర్పంచ్ శిరీషాపృథ్వీరాజ్ పంచాయతీ సిబ్బందితో తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు. పల్లివాడలో సర్పంచ్ సంధ్యాస్వామి వార్డు సభ్యులతో కలిసి మొక్కల ను నాటారు. మునిపంపులలో సర్పంచ్ కవితాయాద య్య ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఉత్తటూరు గ్రామంలో రోడ్డుపై ఉన్న పిచ్చిమొక్కలను సర్పంచ్ కోళ్ల స్వామి పంచాయతీ సిబ్బందితో తొలగించారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ప్రతి ఒక్కరూ పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి కృష్ణ అన్నారు. గురువారం ఆయన ధర్మారం గ్రామంలో జరిగి న పల్లెప్రగతిలో పాల్గొని కలుపు మొక్కల తొలగింపు పనులను పర్యవేక్షించారు. డంపింగ్ యార్డును పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే పల్లెల్లో ప్రగతి
ప్రజల సహకారంతోనే పల్లెలు ప్రగతి పథంలో ముందుంటాయని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మం డలంలోని పొడిచేడు, అనాజిపురం, రాగిబావి, పనకబం డ, గ్రామ పంచాయతీలను సందర్శించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పొడిచేడులో చెత్త తొలగింపు పనుల ను, అనాజిపురం పాత ఇండ్లు కూల్చివేయడం, వైకుంఠధామం పనులను పరిశీలించారు. పనకబండ, రాగిబావి గ్రామాల్లో మొక్కలను నాటడం, గుంతలను తీయడం పనులను పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో మనోహర్రెడ్డి, ఎంపీవో సురేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు మధు, లక్ష్మమ్మ, నాగయ్య, తిరుమలేశ్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులు జోరుగా జరిగాయి. మం డల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగ తి నిర్వహించి హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించి వీధులను శుభ్రంచేశారు. మండలంలోని ఎం.తుర్కపల్లి, జంగారెడ్డిపల్లి, నాగారం గ్రామాల్లో నిర్వహించిన మొక్క లు నాటి కంపచెట్లను తొలగించి పారిశుధ్య పనులను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో గీతారెడ్డి, ట్రాన్స్కో ఏఈ జయన్న, సర్పంచ్లు లలితాశ్రీనివాస్, తుమ్మల పద్మ, తీగుళ్ల కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.