ఇటిక్యాల, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వేడుకొంటూ మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ సరిత బీచుపల్లి అంజన్నకు 101 కొబ్బరికా యలను సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ హన్మంత్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.
సీఎం త్వరగా కోలుకోవాలి
కేటీదొడ్డి, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం మండలంలోని పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు హన్మంత్, నాయకులు గోపి, ఉరుకుందు, శేఖర్రెడ్డి, తిమ్మరెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్, ఏప్రిల్ 20 : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రవిచారి, మధుసూదన్చారి సీఎం కేసీఆర్ గోత్రనామంతో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, యూత్ మండల అధ్యక్షుడు పెద్దపల్లి అజయ్, సర్పంచులు వెంకటేశ్వర్రెడ్డి, వీరేశ్నాయక్, జయరాములు, యాకోబు, సింగిల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, ఉప సర్పంచ్ మల్దకల్, నాయకులు మాజీ ఎంపీటీసీ వెంకటన్న, నరేందర్, చంద్రశేఖర్రెడ్డి, మధు, పరశురాముడు, గోవింద్, తిమ్మరాజు, ప్రభాకర్, కిష్టన్న, మల్దన్న, మల్దకల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయంలో ..
అయిజ, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప (వేంకటేశ్వర)స్వామి ఆలయంలో మంగళవారం ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని పరిపాలన మరింత పరుగులు పెట్టించేందుకు కృషి చేసేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని తిమ్మప్పస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జమ్ములమ్మ ఆలయంలో ..
గద్వాల రూరల్, ఏప్రిల్ 20: సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జములమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్ ఆధ్వర్యంలో 111 టెంకాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ జానకిరాములు, కమ్మరిరాము, సుందర్రాజ్, శంకర్, కాంబ్లే, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం కోలుకోవాలని చర్చిలో ప్రార్థనలు
గద్వాల, ఏప్రిల్ 20: సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంబీమిస్సా చర్చిలో పాస్టర్ రోజర్ బెన్హర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలో పాస్టర్తో పాటు చర్చి కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చర్చి కార్యదర్శి సుధాకర్, చైర్మన్ ఏసయ్య పాల్గొన్నారు.