వాజేడు, ఫిబ్రవరి 18 : మేడారం మహాజాతరలో భాగంగా శుక్రవారం పలువురు ప్రముఖులు వనదేవతల సేవలో తరించారు. గద్దెలపై కొలువై ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును దర్శించుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుకాసింగ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, విప్ రేగ కాంతరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, సీతక్క, శంకర్నాయక్, రెడ్యానాయక్, వివేకనందగౌడ్, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కోరుకంటి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్రావు, మధుసూదనచారి, బండా ప్రకాశ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడె నాగజ్యోతి, టూరిజం చైర్మన్ శ్రీనివాస్గుప్తా, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్రావు, మేడారం ట్రస్టు బోర్డ్ మెంబర్ వద్దిరాజు రవిచంద్ర, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య, అదనపు డీజీపీ నాగిరెడ్డి, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ దర్శించుకున్నారు. ఎత్తుబెల్లం తూకం వేసి అమ్మవార్లకు సమర్పించారు. తల్లుల గద్దెలను దర్శించుకున్నారు.