తొర్రూరు, ఏప్రిల్ 30 : తొర్రూరులోని సాయి మల్టీ స్పెషాలిటి దవాఖానను శుక్రవారం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ చికిత్సల కోసం 50 పడకలను కేటాయించిన ఏకైక ప్రైవేట్ దవాఖాన కావడంతో ప్రభుత్వ నిబంధనలకు లోబడి రోగులకు ఏ తరహా చికిత్స అందిస్తున్నారో వైద్యాధికారును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకనుగుణంగా పలు పరీక్షల నిర్వహణ, అందిస్తున్న చికిత్స విధానంపై రోగుల బంధువులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ దవఖానలో నలుగురు ఐసీఈలో, 16 కరోనా బారినపడిన వారు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారని దవాఖాన నిర్వహకుడు స్వరూప్కుమార్ వివరించారు. ఆమె వెంట జిల్లా కొవిడ్ నోడల్ అధికారి రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో గుండాల మురళి, పీహెచ్సీ వైద్యాధికారి దిలీప్కుమార్ తదితరులు ఉన్నారు.