మొక్కలు నాటుతూ.. పంపిణీ చేస్తున్న
అధికారులు, ప్రజాప్రతినిధులు
హరితహారం నిరంతరం కొనసాగించాలని పిలుపు
ప్రగతి పనులను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు
మహబూబాబాద్రూరల్, జూలై 14: నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని రేగడితండా సర్పంచ్ గుగులోత్ లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం గ్రామ పంచాయతీలో మొక్కలు నాటిన అనంతరం ఇంటింటికీ వెళ్లి ఆరు మొక్క లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తండాలోని ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ రామచంద్రు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ
డోర్నకల్ : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు శాంతినగర్లో కౌన్సిలర్ కాల మౌనిక జైన్తో కలిసి బుధవారం ఇంటింటికీ ఆరు మొక్క లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాలు ష్య రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాల యశోధర్ జైన్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
మెగా పల్లె ప్రకృతి వనం పనుల పరిశీలన
డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెం జీపీలో మెగా పల్లె ప్రకృతి వనం పనులు ఎంపీడీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెగా వనంలో 32,000 మొక్కలు నాటనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పగడాల అంజయ్య, కార్యదర్శి సాయితేజ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కేంద్రంలో మొక్కల పంపిణీ
మరిపెడ : మున్సిపల్ కేంద్రంలోని మొదటి వార్డులో ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేశారు. అంగన్వాడీ టీచర్ లూనావత్ ఇరానీ మొక్కలు పంపిణీ చేస్తూ వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. నాటిన ప్రతి మొక్క నూ రక్షించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లూనావత్ వెంకన్ననాయక్, గ్రామైక్య సంఘం సభ్యురాలు ఉమ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రగతి’పనులు కొనసాగించాలి
పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రజాప్రతినిధులు నిరంతరం కొనసాగించాలని జిల్లా హార్టికల్చర్, మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ అధికారులకు సూచించారు. గాలివారిగూడెం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నివారణకు నిరంతరం పల్లె, పట్టణ ప్రగతి పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.
ట్రైనీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
హరితహారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యా న్ని చేరుకోవాలని ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. మున్సిపల్ కేంద్రంతో పాటు గుండెపూడి గ్రామంలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సిబ్బంది, అధికారులకు సూచించారు. గుండెపూడిలో పల్లె ప్రకృతి పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్, ఎంపీ వో పూర్ణచందర్రెడ్డి పాల్గొన్నారు.