శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతానికి చెందిన సాహిత(35) భర్త రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా ప్రస్తుతం 3 సంవత్సరాల కూతురు ఉంది.
జీవనోపాధి కోసం శామీర్పేట మండలం తుర్కపల్లిలోని లారస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కాగా, గత కొంతకాలంగా తీవ్ర మనోవేధనతో బాధపడుతున్నది. బుధవారం ఉదయం 8 గంటలకు కంపెనీ బస్సులో వెళ్తున్న ఆమే శామీర్పేట చెరువు కట్ట వద్దకు రాగానే వాంతులు వస్తున్నాయని, ఇంటికి తిరిగి వెళ్లిపోతానని చెప్పి బస్సు దిగింది. చెరువు వద్ద దిగిన ఆమె చెరువు కట్టపై ఉన్న దర్గా వద్ద దూకి ఆత్మహత్య చేసుకుంది.
చెరువులో మహిళ ఆత్మహత్య చేసుకుంది అన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఆమెను లారస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించి కంపెనీతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతిరాలి అన్న దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.