ఘట్కేసర్,ఆగస్టు14: బంజారా కుటుంబాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని టీఆర్ఎస్ నాయకుడు, మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి అన్నారు. గోర్ అసోసియేషన్ ఘట్కేసర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2వ వార్డు ఎన్ఎఫ్సీ నగర్లో శనివారం నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బంజారా యువతులు 9 రోజుల పాటు నియమ నిష్టలతో జరుపుకునే పండుగ తీజ్ అని పేర్కొన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, పోచారం వైస్ చైర్మన్ రెడ్యానాయక్, పీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సీఐ చంద్రబాబు, కౌన్సిలర్లు, గోర్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. అంతకు ముందు బంజారా మహిళలు సంప్రదాయ వస్ర్తాలను ధరించి నృత్యం చేశారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు.