పీర్జాదిగూడ, ఆగస్టు 1: కరోనా సమయంలో బ్రాహ్మణులు ఎదురొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని, వెనకబడిని వారిని ఆదుకోవడానికి ఇచ్చే సహాయక రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని మేడ్చల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాలకుర్తి శేషగిరిరావు, రెండు చింత రామ్మూర్తి, రాంబాబులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారిని కలిసి వినతి పత్రం ద్వారా వెల్లడించారు. కరోనా సమయంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ ఇండ్లు ఇప్పించాలన్నారు. విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయాలన్నారు. పరిషత్ స్కీమ్స్, సేవలు, అన్ని వేళలా అందుబాటులో ఉండేటట్లు చూడాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.