మేడ్చల్, జూలై 10: పది రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దిగ్విజయంగా కొనసాగింది. శనివారంతో కార్యక్రమం ముగిసింది. చివరి రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇక ముందు కూడా పరిశుభ్రత, హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
ఘట్కేసర్,జూలై10 : చివరి రోజు పట్టణ ప్రగతిలో ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 14,18వ వార్డుల్లో చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు బండారి వసంత, రవీందర్ల ఆధ్వర్యంలో, పోచారం మున్సిపాలిటీలోని 10, 2వ వార్డుల్లో చైర్మ్న్ కొండల్రెడ్డి, కౌన్సిలర్లు బాలగోని వెంకటేశ్ గౌడ్, ధనలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటి పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ 6 మొక్కలను పంపిణీ చేశారు. వార్డుల్లో మొక్కల పెంపకం దారులను గుర్తించి కుటుంబ సమేతంగా సన్మానించారు. కమిషనర్లు సురేశ్, వసంత, వైస్ చైర్మన్లు రెడ్డ్యానాయక్, మాధవ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 10 : వార్డుల్లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 19, 20వ వార్డుల్లో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటి ఇంటింటికీ మొక్కలను అందజేశారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డుకు రూ.10 లక్షలతో సమస్యలు పరిష్కరిస్తామని చంద్రారెడ్డి తెలిపారు. అనంతరం పట్టణ ప్రగతి సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. దమ్మాయిగూడలోని పలు వార్డుల్లో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు వాణి రెడ్డి, స్వామి, ప్రత్యేక అధికారులు గణేశ్, పూర్ణిమ, వైస్ చైర్మన్లు నరేందర్, మల్లేశ్, కౌన్సిలర్లు సుర్వి శ్రీనివాస్ గౌడ్, అన్నంరాజ సుమిత్ర సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, జూలై 10: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక పరిధిలోని మొదటి, 5వ డివిజన్లలో పర్యటించారు. హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మేయర్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ బొడిగ స్వాతి కృష్ణగౌడ్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, నాయకులు ఆంజనేయులు, నిర్మల, ప్రశాంత్, స్థానిక వార్డు కమిటీ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.