కుత్బుల్లాపూర్,నవంబర్28 : సీసీ కెమెరాలతో మరింత రక్షణ పొందవచ్చని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో కాలనీవాసుల సౌజన్యంతో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న 14 సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులంతా స్వఛ్చందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేశ్
ఎస్ఐ మల్సూర్, కాలనీ అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు బాలరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్గౌడ్, స్థానిక నాయకులు ఉన్నారు.