కుత్బుల్లాపూర్, అక్టోబర్ 10 : నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ డివిజన్, గణేశ్నగర్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్తరాల మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, అలాంటి సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలంతా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, వనం శ్రీనివాస్, యాదగిరి, భాస్కర్గౌడ్, మురళీగౌడ్, దుర్గారావు, లింగంయాదవ్, నర్సింగరావు, కృష్ణ, రాజిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.
ముదిరాజ్ల సమస్యలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించే దిశగా చొరవ చూపిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి.. శాలువతో సత్కరించారు. ముదిరాజ్ల ఆర్థికాభివృద్ధిలో భాగంగా జీఓ 6/2016 సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. సంఘం అధ్యక్షుడు పిట్ల నగేశ్, కృపాసాగర్, సత్యం, గుమ్మడి మధుసూదన్రాజు, లింగం, వెంకటేశ్, నర్సింహా, కృష్ణ, శంకర్, మంజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.