కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 24: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పాలన సాగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధిలో రూ.59. 50 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతసురేశ్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్లో మన్నికగా ఉండేలా కోట్లాది నిధులతో సంక్షేమానికి బాటలు వేస్తున్నామన్నారు. గాజులరామారం-కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ సహకారంతో శంకుస్థాపన చేశామన్నారు. త్వరలోనే పను లు ప్రారంభించి నాణ్యతతో పాటు మన్నికగా ఉండేలా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి శివాజీ, మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, ఏఈ ఆశ, అడప శేషు, భాస్కర్రెడ్డి, ఇస్మాయిల్, విజయ్, శేఖర్, శివ, ప్రభాకర్, సురేశ్, పద్మజారెడ్డి, పద్మలత, లలిత, సుభాష్నగర్ ఫేస్-2 కాలనీ అధ్యక్షుడు కృష్ణ, రమణారెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.