ఘట్కేసర్, జూన్ 24 : ప్రమాదవశాత్తు గాయాలై దవాఖానలో చేరిన మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డిని మంత్రి మల్లారెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన ఘట్కేసర్ సమీపంలోని నారపల్లిలో వజ్ర దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి నేరుగా దవాఖానకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరా, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నాయకుడు కుమార్ పాల్గొన్నారు