ఘట్కేసర్, ఏప్రిల్4: మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో పోచారం 15 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అబ్బవతి సరిత ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్ఎస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి అనేకమంది ప్రజా ప్రతినిధులు, అభిమానులు చేరుతున్నారని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇతర పార్టీలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ సరితకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, కౌన్సిలర్లు సాయిరెడ్డి, రవి, వెంకటేశ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు అక్రం అలీ, పార్టీ అధ్యక్షుడు మందడి సురేందర్రెడ్డి, నాయకులు బద్దం జగన్మోహన్రెడ్డి, అబ్బవతి నర్సింహ, అబ్బవతి స్వామి కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని జెండాలతో నారపల్లి నుంచి ఘట్కేసర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.