మేడ్చల్, మార్చి 21(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో వెజ్-నాన్వెజ్ మార్కె ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెజ్-నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల మున్సిపాలిటీలలో స్థలాల ఎంపికను పూర్తి చేశారు. ఎంపిక చేసిన స్థలాల నివేదిక ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఉన్న కార్పొరేషన్ల, మున్సిపాలిటీలలో 13 వెజ్-నాన్వెజ్ మార్కె ట్ల నిర్మాణాలను చేపట్టానున్నారు. స్థలాల విస్తీర్ణంలో అవసరమయ్యే నిర్మాణాలను అంచనా వేసి ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. మార్కెట్లను ఏర్పాట్లు చేసే ప్రాంతాలు ప్రజలందరకి అందుబాటులో ఉండటంతో పాటు ఆమోదయోగ్యంగా ఉండే స్థలాలను ఎంపిక చేశా రు. ఒకే చోట వెజ్-నాన్వెజ్ మార్కెట్లు ఉంటే మార్కెటిం గ్ చేసేందుకు వ్యాపారులకు, వినియోగదారులకు సౌకర్యంగా మారనుంది. ప్రస్తుతం, కొనసాగిస్తున్న మార్కెట్ల లో సరైన సౌకర్యాలు లేక పో వడంతో అనాదిగా పడుతు న్న ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. జిల్లాలోని మేడ్చల్, తూకుం ట, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, బొడుప్ప ల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, కొంపల్లి, నిజాంపేట్, దుండిగల్ కార్పొరేషన్ల, మున్సిపాలిటీలలో మార్కెట్ల నిర్మాణాలు జరగనున్నాయి.
స్థలాలు ఎంపిక
వివిధ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వెజ్-నాన్వెజ్ మార్కెట్లకు అనుకూలంగా ఉన్న స్థలాలను మున్సిపల్ అధికారులు ఎంపిక చేయగా, ఇటీవలే ఇన్చార్జి మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, శ్వేతా మహంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యాంసన్ స్థలాలను పరిశీలించారు. మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రజలకు అందుబాటులో ఉండటంతో కలెక్టర్ శ్వేతా మహంతి సంతృప్తి వ్యక్తం చేయడం తో ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. జనావా స ప్రాంతాలకు మార్కెట్ల ఏర్పాటుకు స్థలాల అనువుగా ఉండటంతో ప్రజలకు సౌలభ్యం ఏర్పడనుంది.
13 మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు ఎంపిక
జిల్లాలో 13 వెజ్-నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు స్థలా ల ఎంపిక పూర్తయింది. నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాం. మార్కెట్ల స్థలాల విస్తీర్ణం ప్రకారం, నిర్మించినను న్న మార్కెట్లకు అంచనా వేసి ప్రభుత్వం నిధులను మంజూ రు చేయనుంది. జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలలో మార్కెట్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం. మార్కెట్ల నిర్మాణంతో వ్యాపారులకు, వినియోగదారులకు సౌకర్యంగా మారనుంది. శ్యాంసన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్