జీడిమెట్ల, మే 16: చట్టం ఎవరికీ చుట్టం కాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదని నిరూపించారు జీడిమెట్ల సీఐ బాలరాజు. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో షాపూర్నగర్ చౌరస్తా.. సాగర్ హోటల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో షాపూర్నగర్ నుంచి సూరారం వైపునకు పోలీస్ స్టిక్కర్ ఉన్న కారు వెళ్తుండగా పోలీసులు ఆపారు. తనిఖీ చేయగా నిజామాబాద్కు చెందిన ఎస్సై వాహనంగా తేలింది. ఆ వాహనాన్ని ఎస్సై బామ్మర్ది నడుపుతూ నిబంధనలు పాటించకపోవడంతో సీఐ బాలరాజు రూ.1000ఫైన్ వేశాడు. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే శిక్ష తప్పదని ఇన్స్పెక్టర్ సూచించారు. అయితే సీఐ బాలరాజు పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.