మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి, ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, ఇందిరా, సహకార సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.