వికారాబాద్, జూన్ 9, (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కదాలేని విధంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ సీహెచ్సీ దవాఖానలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లో ప్రజలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కిడ్నీ, లివర్, థైరాయిడ్, గుండెజ బ్బులు వంటి 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారన్నారు. టెస్టులు చేసిన 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సెల్ఫోన్కు వస్తాయన్నారు.
వికారాబాద్ జిల్లా ప్రజలకు మొదటి విడుతలోనే డయాగ్న స్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రూ.3.50 కోట్లు ఖర్చు చేసి ఈ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగం బలోపేతమవు తున్నదని, ఇది పేద ప్రజలకు వరంగా మారబోతుందన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన దానికి అదనంగా రూ.10వేల కోట్లు ఆరోగ్య రంగానికి ఖర్చు పెట్టడంతో వైద్య రంగం దశ మారనుందన్నారు. జిల్లాలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసుకుని ప్రారంభిం చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కేంద్రంలో 57 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పేదలకు ఖర్చు తగ్గుతుందన్నారు. అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని గుర్తు చేశారు. హెల్త్ ప్రొఫైల్ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సరైన వైద్యం అందించేం దుకు వీలుగా ఉంటుందన్నారు.
కొద్ది రోజుల క్రితం కిడ్నీ పేషంట్ల కోసం డయాలసిస్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రసవం జరిగిన తర్వాత తల్లీబిడ్డలను ఇతర రోగులతో కాకుండా ప్రత్యేకంగా వైద్య సేవలందించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఇందుకోసం తాండూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కోన్నారు. అలాగే హైరిస్క్ ప్రసవాలకు అవసరమైన వైద్య సేవల కోసం ప్రత్యేక ‘మెటర్నల్ ఐసీయూ’లను, నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీ యూలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గర్భిణులకు మూడో నెల నుంచి సమతుల పౌష్టికాహార కిట్లను అందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, విద్యా మౌళిక సదుపాయాల కల్పన చైర్మన్ నాగేందర్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీ కృష్ణగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు.